తెలంగాణలో మరో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ

పార్లమెంటు ఎన్నికల క్రమంలో తెలంగాణ‌లో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌రో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు

  • Publish Date - February 28, 2024 / 12:54 PM IST

విధాత, హైదరాబాద్‌ : పార్లమెంటు ఎన్నికల క్రమంలో తెలంగాణ‌లో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌రో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు. మెద‌క్ క‌లెక్ట‌ర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌గా రాజ‌ర్షి షా, కుమ్రం భీం ఆసిఫాబాద్ క‌లెక్ట‌ర్‌గా స్నేహ శ‌బ‌రీశ్‌, జీహెచ్ఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్‌గా బీహెచ్ స‌హ‌దేవ్‌రావు, హైద‌రాబాద్ అద‌న‌పు క‌లెక్ట‌ర్‌గా హేమంత కేశ‌వ పాటిల్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.


8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ


రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పర్సా రాంబాబు, హనుమకొండ అదనపు కలెక్టర్‌గా ఎ. వెంకట్ రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా బీఎస్ లత, ములుగు అదనపు కలెక్టర్‌గా సీహెచ్ మహేందర్‌ను, హెచ్‌ఎండీఏకు మహ్మద్ అసదుల్లా, జీ. వీరారెడ్డిలను బదిలీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్‌గా డి.వేణుగోపాల్‌లను బదిలీ చేసింది.

Latest News