రంజాన్ ప్రార్థనలకు ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు

రంజాన్ మాసం సందర్భంగా ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

  • Publish Date - March 6, 2024 / 01:51 PM IST

విధాత : రంజాన్ మాసం సందర్భంగా ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంట‌ల‌కే త‌మ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. నెలవంక దర్శనం మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.


ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి అవతరించిందని ముస్లింలు నమ్ముతారు. ఇందుకు ప్రతీక‌గా ఈ మాసంలో ఉపవాసాలను ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు.

Latest News