Two killed in a road accident
విధాత: నల్గొండ జిల్లా పెద్దవుర మండలం చింతపల్లి స్టేజి వద్ద ఆటోను వెనుక నుండి లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా హాస్పిటల్కు తరలించారు.
మృతులు త్రిపురారం మండలం సత్యంపాడ్ తండా వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ సాగిస్తున్నారు.