ఆ సన్నిహిత శ‌బ్దాలు విన‌లేక‌పోతున్నాం.. పొరుగింటి జంట‌పై పోలీసుల‌కు ఫిర్యాదు

అదో అపార్ట్‌మెంట్.. అందులో ప‌దుల సంఖ్య‌లో కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఓ ఫ్లాట్‌లో ఉన్న జీవిస్తున్న జంట‌పై ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో నివాస‌ముంటున్న మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

  • Publish Date - March 21, 2024 / 09:39 AM IST

బెంగ‌ళూరు : అదో అపార్ట్‌మెంట్.. అందులో ప‌దుల సంఖ్య‌లో కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఓ ఫ్లాట్‌లో ఉన్న జీవిస్తున్న జంట‌పై ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో నివాస‌ముంటున్న మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే ఆ జంట బెడ్రూమ్ కిటికీ మూయ‌ట్లేద‌ని, వారి స‌న్నిహిత శ‌బ్దాల‌తో త‌మ‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని స‌ద‌రు మ‌హిళ ఫిర్యాదులో పేర్కొన్న‌ది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలోని అవ‌ల‌హ‌ళ్లి బీడీఏ లే అవుట్‌లో వెలుగు చూసింది.

అయితే ఆ దంప‌తుల చేష్ట‌ల‌తో త‌మ కుటుంబంలో మ‌న‌శ్శాంతి లేకుండా పోతుంద‌ని బాధిత మ‌హిళ పేర్కొన్నారు. వారు బెడ్రూం కిటికీ మూయ‌క‌పోవ‌డంతో వ్యక్తిగత సంభాషణలు, సన్నిహిత శబ్దాలు తమ ఇంట్లోకి వినిపిస్తున్నాయని ఫిర్యాదులో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే వారు కిటికీని తెరిచి ఉంచుతున్నారని ఫిర్యాదులో ఆరోపించింది.

బెడ్రూం కిటికీ మూసివేయాల‌ని ప‌లుసార్లు చెప్పిన‌ప్ప‌టికీ వినిపించుకోలేద‌న్నారు. ఓన‌ర్‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేకుండా పోయింద‌న్నారు. చివ‌ర‌కు చేసేదేమీ లేక పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల్సి వ‌చ్చింద‌ని మ‌హిళ తెలిపారు. ఇక త‌మ కుటుంబ స‌భ్యుల‌ను చంపేస్తామ‌ని, అత్యాచారానికి కూడా వెనుకాడ‌బోమ‌ని బెదిరింపుల‌కు గురి చేశార‌ని బాధితురాలు పోలీసుల‌కు చెప్పారు. మ‌హిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఐపీసీ సెక్ష‌న్లు 504, 506, 509, 34 కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest News