బీహార్కు చెందిన బాలికలగా గుర్తింపు
విధాత, హైదరాబాద్ : దేవుడి దగ్గరకు వెళ్తున్నామని చెప్పి మూడు నెలల తర్వాత వస్తామని మా కోసం వెతికితే ఆత్మహత్య చేసుకుంటామని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముగ్గురు బాలికలు మరో రాష్ట్రంలో శవాలై కనిపించారు. బిహార్ రాష్ట్రం ముజఫర్కు చెందిన ముగ్గురు స్నేహితులు గౌరీ కుమారి(14), మోహినీ కుమారి(14), మాయా కుమారి(13)లు దేవుడు పిలుస్తున్నాడని చెప్పి హిమాలయాలకు వెళ్తున్నామని.. మూడు నెలల తర్వాత తిరిగొస్తాం.. ఈలోపు మీరు మా గురించి వెతికితే ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ సారి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
కాగా.. నాలుగు రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని మథురలో వారు శవాలై కనిపించారు. హైవే పోలీస్ స్టేషన్ పరిధిలోని బజానా బీచ్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తమ కోసం వెతికితే ఆత్మహత్య చేసుకుంటామని లెటర్లో బెదిరించిన నేపథ్యంలో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మథుర హైవే పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.