Site icon vidhaatha

సామ్​సంగ్ ​ఫోల్డబుల్స్ కొత్త తరం వచ్చేసింది!

హైదరాబాద్, జూలై 9 (టెక్​ డెస్క్​): ఫోల్డబుల్‌ ఫోన్ల విభాగంలో మళ్లీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు, సామ్​సంగ్ ​తమ నూతన తరం ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. గెలాక్సీ Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7, అలాగే బడ్జెట్ రేంజ్‌కు దగ్గరగా ఉండే ఫ్లిప్ 7 FE లను కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ ఫోన్లు సాంకేతికంగా మాత్రమే కాకుండా మేధోపరంగా కూడా అత్యున్నత స్థాయిలో రూపొందించబడ్డాయి. గూగుల్ జెమిని AI సహకారంతో పని చేసే ఫీచర్లు, సరికొత్త డిజైన్‌, ప్రాసెసింగ్ శక్తి మరియు కెమెరా సామర్థ్యం ఈ కొత్త ఫోన్ల విశిష్టతలు.

గెలాక్సీ Z ఫోల్డ్ 7 :  పలుచటి ఆకారం ‌‌–  గొప్ప తెలివితేటలు

గెలాక్సీ Z ఫ్లిప్ 7 : స్టైల్తో కూడిన పనితనం

గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE :  ఫోల్డబుల్ని ఫోన్అందరికీ అందుబాటులో..

 

AI ఫోకస్ గూగుల్ జెమినితో కొత్తగా..

One UI 8 (Android 16) ఆధారంగా నడిచే ఈ ఫోన్లు Gemini Live అనే కొత్త ఫీచర్‌ తో వస్తున్నాయి. ఇందులో:

 

ధరలు (భారత్‌లో):

మోడల్ ప్రారంభ ధర
Galaxy Z Flip 7 FE ₹89,999
Galaxy Z Flip 7 ₹1,09,999
Galaxy Z Fold 7 ₹1,74,999
Galaxy Watch 8 ₹32,999 ప్రారంభ ధర

 

ఈ ఫోల్డబుల్‌ ఫోన్లు వాడకంలో స్టైల్‌, పనితీరులో శక్తివంతంగా ఉండేలా రూపొందించబడ్డాయి. వర్క్ & ఒంటిచేతి వాడకం  కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి సామ్​సంగ్ ​ఆధిపత్యాన్ని నిరూపించనున్నాయనే నమ్మకం టెక్‌ వర్గాల్లో ఉంది. ప్రధాన పోటీదారైన ఆపిల్​ కూడా వచ్చే ఏడాది ఫోల్డబుల్​ ఫోన్ల రంగంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, సామ్​సంగ్​ చాలా జాగ్రత్త పడింది. ఇప్పటికే ఫోల్డబుల్​ ఫోన్ల విషయంలో చాలా ముందున్న సామ్​సంగ్​ను సవాల్​ చేయడం ఆపిల్​కు కష్టసాధ్యమైన విషయంగా మొబైల్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

 

Exit mobile version