Site icon vidhaatha

నామినేటెడ్ పదవుల జాతర.. ఒకేసారి 34కార్పోరేషన్లకు చైర్మన్ల నియామకం

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఆశావహులన ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న కార్పొరేషన్ల పదవులను ప్రభుత్వం ఎట్టకేలకు భర్తీచేసింది. ఒకేసారి 34కార్పోరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా రెడ్డిని నియమించింది. అదేవిధంగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్‌ను మైనింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది. కార్పోరేషన్ల చైర్మన్‌లు తమ పదవుల్లో రెండేళ్ల కాలపరిమితితో కొనసాగనున్నారు.

కార్పొరేషన్లు-చైర్మన్లు

ఎ. అన్వేష్‌ రెడ్డి – విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియామితులయ్యారు. కాసుల బాలరాజు – ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, జంగా రాఘవరెడ్డి – ఆయిల్‌ సీడ్స్‌ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, మానాల మోహన్‌రెడ్డి – రాష్ట్ర సహకార సంఘం చైర్మన్‌గా, రాయల నాగేశ్వరరావు – గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా, జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్ – ముదిరాజ్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, మెట్టు సాయికుమార్ – మత్స్య సహకార సమాఖ్య చైర్మన్‌గా, రియాజ్ – గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా నియామితులయ్యారు. పొదెం వీరయ్య – అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, కాల్వ సుజాత – ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా, గురునాథ్‌ రెడ్డి – పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, గిరిధర్‌ రెడ్డి – సెట్విన్‌ చైర్మన్ చైర్మన్‌గా, జనక్‌ ప్రసాద్ – కనీస వేతనాల అడ్వైజరీ బోర్డ్ చైర్మన్‌గా, విజయ బాబు – వ్యవసాయాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా, నాయుడు సత్యనారాయణ – హాండిక్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, అనితా ప్రకాశ్‌ రెడ్డి – ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామితులయ్యారు.

మన్నె సతీశ్‌ కుమార్ – టెక్నాలజీ సర్వీసెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, జబ్బార్ – మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, అలేఖ్య పుంజాల – సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా, ఈరవత్రి అనీల్ – మైనింగ్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, చల్లా నర్సింహారెడ్డి – అర్బన్‌ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా, ఇనగాల వెంకట్రామిరెడ్డి – కుడా చైర్మన్‌గా, నరేందర్‌ రెడ్డి – శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా, పటేల్‌ రమేశ్‌ రెడ్డి – స్టేట్‌ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, ఎంఏ ఫహీమ్ – తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా నియామితులయ్యారు. బండారు శోభారాణి – ఉమెన్స్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా, ఎం. వీరయ్య – వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా, కే.శివసేనా రెడ్డి – స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా, ఎన్‌. ప్రీతమ్ – షెడ్యూల్డ్‌ క్యాస్ట్ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, నూతి శ్రీకాంత్ – బీసీ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, బెల్లయ్య నాయక్ – ఎస్టీ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా, కే. తిరుపతి – గిరిజన కోఆపరేటివ్‌ ఫైనాన్స్ చైర్మన్‌గా, జే. జైపాల్ – వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా టి. నిర్మలా రెడ్డి నియామితులయ్యారు.

Exit mobile version