టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో పుట్ట మ‌ధు

విధాత‌(హైద‌రాబాద్ ): తెలంగాణ రాష్ట్రం,పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధును రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గ‌త వారం రోజులుగా పుట్ట మ‌ధు అదృశ్య‌మైన సంగ‌తి తెలిసిందే. భీమ‌వ‌రంలో పుట్ట మ‌ధును అరెస్టు చేసిన పోలీసులు.. పెద్ద‌ప‌ల్లి జిల్లాకు తీసుకొచ్చారు. గ‌త వారం రోజులుగా అదృశ్యానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు మ‌ధును ప్ర‌శ్నిస్తున్నారు. గ‌ట్టు వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఇప్ప‌టికే ఒక‌సారి పోలీసులు పుట్ట మ‌ధును విచారించారు. స‌ద‌రు హ‌త్య కేసుకు […]

  • Publish Date - May 8, 2021 / 10:36 AM IST

విధాత‌(హైద‌రాబాద్ ): తెలంగాణ రాష్ట్రం,పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ పుట్ట మ‌ధును రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గ‌త వారం రోజులుగా పుట్ట మ‌ధు అదృశ్య‌మైన సంగ‌తి తెలిసిందే. భీమ‌వ‌రంలో పుట్ట మ‌ధును అరెస్టు చేసిన పోలీసులు.. పెద్ద‌ప‌ల్లి జిల్లాకు తీసుకొచ్చారు.

గ‌త వారం రోజులుగా అదృశ్యానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు మ‌ధును ప్ర‌శ్నిస్తున్నారు. గ‌ట్టు వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఇప్ప‌టికే ఒక‌సారి పోలీసులు పుట్ట మ‌ధును విచారించారు. స‌ద‌రు హ‌త్య కేసుకు సంబంధించి గ‌ట్టు వామ‌న్ రావు తండ్రి గ‌ట్టు కిష‌న్ రావు ఇటీవ‌ల ఇచ్చిన మ‌రో ఫిర్యాదుతో మ‌ధును రామ‌గుండం పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.

Latest News