విధాత : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్రెడ్డి పార్లమెంటుకు వెళ్లి స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడిగా ఉండగానే తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఒక్కరికి ఒకే రాజ్యంగ పదవి నిబంధనలను అనుసరించి ఆయన తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.