విధాత: భారత్ బంద్ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వామపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ బంద్లో భాగంగా కరీంనగర్ బస్టాండ్ వద్ద వామపక్ష నేతలు నిరసనకు ప్రయత్నించారు. వెంటనే అక్కడకు పోలీసులు చేరుకుని నేతలను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.