విధాత: హైదరాబాద్ కేంద్రంగా రెండు తలల పామును (red sand boa) అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం పట్టుకుంది. ఘట్ కేసర్ అటవీ ప్రాంతంలో ఈ పాము ను పట్టుకున్న ముఠా సభ్యులు కొంత కాలంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పామును ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుందని, గుప్త నిధులు దొరుకుతాయానే అపోహను ప్రచారంలో పెట్టారు. విశ్వసనీ య సమాచారం అందుకున్న అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి, పాము కొనుగోలుదారులుగా ఆపరేషన్ మొదలు పెట్టారు. వి జిలెన్స్ డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో పలుమార్లు ప్రయ త్నించి ఈ ముఠాను పట్టుకున్నారు. సుమారు నాలుగున్న ర కేజీల బరువుతో బలంగా ఉన్న పామును డెభై లక్ష లకు అమ్ముతామంటూ నలుగురు సభ్యుల ముఠా బేరం పె ట్టింది. అనేక సార్లు ఆపరేషన్ చేస్తున్న అధికారులను ఏమా ర్చే ప్ర యత్నం చేస్తూ చివరకు ఈసీఐఎల్ సమీపం నాగారం లో ఓ ఇంట్లో దొరికిపోయారు. సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయు డు వెంకటరమణ, వీ. ఆంజనేయ ప్రసాద్ ఓ ముఠాగా ఏర్పడి వివిధ ప్రయత్నాల్లో పామును అమ్మి భారీగా సొమ్ము చేసు కునే ప్రణాళిక వేశారు. నలుగురినీ అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు ఓ కారును, టూ వీలర్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అంద రినీ మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ కొ నసాగుతోంది. ఈ ఆపరేషన్ లో విజిలెన్స్, యాంటీ పోచింగ్, కీ సర రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ లో పాల్గొన్న డీఎఫ్ఓ తో పాటు, విజిలెన్స్ సిబ్బందిని అటవీ సం రక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్. శోభ అభినందించారు.
రెండు తలల పాము అపోహ మాత్రమే రెండు తలల పాముగా పిలిచే రెడ్ సాండ్ బోవాకు వాస్తవానికి రెండు తలలు ఉండవని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆపాము ద్వారా అదృష్టం, గుప్త నిధులు కలిసిరావటం అనేది పూర్తిగా అపోహ మాత్రమేనని స్పష్టంచేశారు. అలా ప్రచారం చేస్తూ డబ్బుచేసుకునే ముఠాల మాటల నమ్మవద్దని తెలి పారు. పామును అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తప్ప వన్నారు. ఈ రకమైన సమాచారం తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 18004255364 కు ఫిర్యాదు చేయాలన్నారు.