మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నిక‌ల క‌మిష‌న్‌. మే 2వ‌ తేదీన నోటిఫికేషన్ జారీ చేయ‌నున్న‌ది.

  • Publish Date - April 25, 2024 / 03:51 PM IST

విధాత‌: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నిక‌ల క‌మిష‌న్‌. మే 2వ‌ తేదీన నోటిఫికేషన్ జారీ చేయ‌నున్న‌ది. నామినేష‌న్లు వేసేందుకు మే, 9వ తేదివ‌ర‌కు గడువు పెట్టింది. మే, 10న స్క్రూటినీ, నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు 13 వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చింది. ఇక పోలింగ్ మే, 27న‌ ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ది. అయితే ఈ ఎన్నిక కౌంటింగ్ జూన్‌, 5వ తేదీన నిర్వ‌హించి, ఫ‌లితాల‌ను జూన్‌, 8వ తేదీన వెల్ల‌డిస్తున్న‌ట్లు ఎన్నిక‌ల  సంఘం తెలిపింది.

Latest News