Site icon vidhaatha

ఇంట‌ర్ మొద‌టి ఏడాది మార్కులే రెండో ఏడాదికి

విధాత:తెలంగాణలో ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇంటర్​ మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు వెల్ల‌డించింది.

ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్‌ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ReadMore:సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ ఆదేశాలను పాటిస్తాం… ఆదిమూలపు సురేష్

Exit mobile version