విధాత,హైదరాబాద్: టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని బలపర్చడానికే తిరిగి కాంగ్రెస్లోకి వస్తున్నానని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు.మంచి రోజు చూసుకొని పార్టీలో చేరతానన్నారు. తన తండ్రి డీఎస్ కోసం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నానని చెప్పారు.కానీ అది కండువా కాదు.. గొడ్డలి అని తనకు తెలుసని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్తో పోలిస్తే..టీఆర్ఎస్ పార్టీయే కాదన్నారు. కడుపులో కోపం ఉన్నా..ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తన తమ్ముడు ఏ పార్టీలో ఉంటే.. తనకేంటి అన్నారు. రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.