Site icon vidhaatha

Minister Ponguleti | యుద్ధప్రాతిపదికన మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణం

దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం
పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం: దశాబ్దాల నుండి ఖమ్మం.. పాలేరు నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముంపు సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నదీ తీరం వెంబడి ఆర్‌సిసి రిటైనింగ్‌వాల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను బుధవారం నాడు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ.. యుద్ధప్రాతిపదికన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలని చెప్పారు.

ఇప్పటికే నాలుగు నెలల సమయం వృథా అయినందున ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. పదిరోజుల్లో మళ్ళీ వస్తా… పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యుల పై చర్యలు తప్పవని, పనుల్లో నాణ్యత లోపించిన ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు మున్నేరు కు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని కోరారు. గోళ్ళపాడు సైడ్ డ్రెన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించాలని చెప్పారు. స్టార్టింగ్ పాయింట్… ఎండింగ్ పాయింట్ లను గుర్తించి సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులను చేపట్టాలని, తద్వారా మురికి నీరు మున్నేరులో చేరకుండా ఉంటుందని తెలిపారు.

Exit mobile version