Site icon vidhaatha

ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ

విధాత,హైదరాబాద్‌: ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష వి చారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది.ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజూ ఒక ధర్మాసనం,ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ చేపట్టాలని సూచించింది. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులనే విచారణకు అనుమతించాలని పేర్కొంది.వాదించాల్సిన కేసులు ఉన్న న్యాయవాదులు మాత్రమే విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల మేరకు ఆగస్టు 8 వరకు హైకో ర్టులో ఆన్‌లైన్‌లోనే విచారణ ప్రక్రియ కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.

Exit mobile version