బీఆరెస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ వాయిదా

బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న బీఆరెస్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది

  • Publish Date - July 3, 2024 / 01:27 PM IST

దానం, కడియం, తెల్లంల అనర్హతకు బీఆరెస్ పిటిషన్‌

విధాత : బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న బీఆరెస్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లంలు బీఆరెస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఫిరాయింపుల చట్టం అతిక్రమించారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆరెస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది.

పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లుగా హైకోర్టు తెలిపింది. అటు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సైతం బీఆరెస్ ఫిర్యాదు చేసింది.

Latest News