Site icon vidhaatha

నేడు తెలంగాణ కేబినెట్

విధాత,హైదరాబాద్ : ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాలు ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నది. వీలైనంత త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు శాఖలవారీగా ఖాళీల సంఖ్యను గుర్తించిన ఆర్థికశాఖ అధికారులు సమగ్రమైన నోట్‌ను రూపొందించారు. దీనిపై చర్చించనున్న క్యాబినెట్‌ ఉద్యోగాల భర్తీ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయనున్నది. కృష్ణాపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రాష్ట్ర క్యాబినెట్‌ చర్చించనున్నది.

Exit mobile version