Site icon vidhaatha

తెలంగాణలో రెండు కోట్ల మందికి పూర్తైన వ్యాక్సినేషన్

విధాత‌: తెలంగాణలో రెండు కోట్ల మందికి కోవిడ్ వాక్సినేషన్ పూర్తైంది. ఈ సందర్బంగా సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేక్ కట్ చేసి అభినందించారు. గత కొన్ని నెలలుగా వాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓఎస్‌డీ గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Exit mobile version