విధాత: తెలంగాణలో రెండు కోట్ల మందికి కోవిడ్ వాక్సినేషన్ పూర్తైంది. ఈ సందర్బంగా సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేక్ కట్ చేసి అభినందించారు. గత కొన్ని నెలలుగా వాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓఎస్డీ గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జి. శ్రీనివాస్ పాల్గొన్నారు.