Site icon vidhaatha

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్

విధాత:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం
కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో
ఆదిత్య నాథ్ దాస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆయనకు స్వామివారి ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందించారు.టీటీడీ సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.

Exit mobile version