విధాత : దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీటీవీ కెమెరాలను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.