Site icon vidhaatha

ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు ఏడీజీ హోదా

విధాత‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మంది ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వంలో ఏడీజీ, అందుకు సమానమైన స్థాయి హోదా పదవులు చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. వీరందర్నీ ఏడీజీ ర్యాంక్‌ పదవులకు ఎంప్యానల్‌ చేసింది. ఇందులో 1991 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌, 1992వ బ్యాచ్‌కు చెందిన జితేందర్‌, ఏపీ నుంచి 1992 బ్యాచ్‌కు చెందిన నళిన్‌ప్రభాత్‌ ఉన్నారు.

Exit mobile version