Site icon vidhaatha

శ్రీవారి దర్శనాలపై కొవిడ్ ప్రభావం

తిరుమల: శ్రీవారి దర్శనాలపై కొవిడ్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే నిన్న కాస్త భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం స్వామివారిని 5108 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.20 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2277 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Exit mobile version