క‌రోనాతో కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ క‌న్నుమూత‌

విధాత‌(న్యూఢిల్లీ): కరోనా మ‌హ‌మ్మారికి మ‌రో రాజ‌కీయ ప్ర‌ముఖుడు ప్రాణాలొదిరారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. 82 ఏళ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బారినప‌డ్డారు. అప్ప‌టినుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తుల‌లో ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం తెల్ల‌వారుజామున‌ తుది శ్వాసవిడిచారు. మాజీ ప్ర‌ధాని చౌద‌రీ చ‌ర‌ణ్ సింగ్ కుమారుడైన అజిత్ […]

  • Publish Date - May 6, 2021 / 05:01 AM IST

విధాత‌(న్యూఢిల్లీ): కరోనా మ‌హ‌మ్మారికి మ‌రో రాజ‌కీయ ప్ర‌ముఖుడు ప్రాణాలొదిరారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. 82 ఏళ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బారినప‌డ్డారు. అప్ప‌టినుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు.

అయితే ఊపిరితిత్తుల‌లో ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం తెల్ల‌వారుజామున‌ తుది శ్వాసవిడిచారు. మాజీ ప్ర‌ధాని చౌద‌రీ చ‌ర‌ణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్.. కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు.

అజిత్ సింగ్ 1939లో జ‌న్మించారు. ఆయ‌న ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (చికాగో)లో ఉన్న‌త విద్య అభ్య‌సించారు. అమెరికాలో 15 ఏళ్ల‌పాటు కంప్యూట‌ర్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసిన ఆయ‌న..త‌న తండ్రి చ‌ర‌ణ్ సింగ్‌ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత దేశానికి తిరిగి వ‌చ్చారు. 1986లో తొలిసారిగా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాఘ్‌ప‌ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏడు సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

ప్రధాని సంతాపం

అజిత్‌సింగ్‌ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. రైతు ప్రయోజనాల కోసం అంకిత భావంతో పని చేశారని పేర్కొన్నారు. కేంద్రంలో పలు విభాగాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని ట్వీట్‌ చేశారు. అజిత్ సింగ్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్రమంత్రులు సంతాపం తెలిపారు.

Latest News