విధాత :అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డ్ పరిధి నోటిఫై చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ,తెలంగాణ సీఎం లు పాల్గొన్నారు.పూర్తి స్థాయిలో చర్చించి గెజిట్ తయారు చేశాం.రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది.బోర్డు ల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో 200 కోట్లు ఇవ్వాలి.డబ్బుకు ఎలాంటి లోటు రాకూడదు.గెజిట్ లో ప్రస్తావన ఉన్నంత ప్రాజెక్టులకు మాత్రాన ఆమోదం అని భావించ కూడదు.సి ఐ ఎస్ ఎఫ్ బలగాలతో ప్రాజెక్టులకు రక్షణ.రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి చాలా సమయం పట్టింది.అపెక్స్ కౌన్సిల్ సమావేశం మధ్య నాలుగు సంవత్సారలు పట్టింది.సెక్షన్ 87 ప్రకారం బోర్డు పరిధి నోటిఫై చేసే అధికారం ఉంది
నోటిఫై చేసేందుకు మేము చాలా సమయం వేచి చూశాం.కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉంది
విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను నియమించవచ్చు.
(సంజయ్ అవస్తీ, జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి)
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలను వివరించిన అధికారులు.
విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ.
విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉంది.
సెక్షన్ 84 ప్రకారం రెండు నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, పరిధి నోటిఫై చేయాల్సి ఉంది.
సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది.
కౌన్సిల్లో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారు.
2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సెంట్రల్ వాటర్ కమిషన్ భాగస్వామ్యం, సహకారంతో ఎంతో కసరత్తు చేసి గెజిట్ తయారు చేసాం.
కృష్ణ, గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చాం.
అందులో ఆమోదించినవి, ఇంకా ఆమోదం పొందని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.
అప్రూవ్ కాని ప్రాజెక్ట్స్ గురించి సమగ్ర వివరణ ఇచ్చాం.
గెజిట్ లో ప్రస్తావించాం కాబట్టి, వాటికి ఆమోదం లభించింది అనుకోవద్దు.
అదే విషయం ఇందులో స్పష్టంగా పేర్కొన్నాం.
షెడ్యూల్-1 లో అన్ని ప్రాజెక్ట్స్ పేర్కొన్నాం
షెడ్యూల్-2 లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ బోర్డుల పరిధిలోనే ఉంటాయి.
భద్రత కూడా కేంద్ర బలగాలు చూసుకుంటాయి.
షెడ్యూల్-3 లో ఉండే ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుంది.