విధాత:టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారులను ఇప్పటికే మెచ్చుకున్న ప్రధాని మోదీ.. వాళ్లతో సోమవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.తన నివాసానికి వచ్చిన అథ్లెట్లను మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఒక్కో అథ్లెట్ వద్దకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడారు. వారు సాధించిన విజయాలను ప్రశంసించారు. మున్ముందు మరింత బాగా రాణించాలని సూచించారు.ఈ క్రమంలో పీవీ సింధుతో కలిసి ఐస్క్రీం తిన్నారు. నీరజ్ చోప్రాకు చుర్మా రుచి చూపించారు. క్రీడాకారులతో కలిసి ఫొటోలు దిగారు.