Site icon vidhaatha

ఆర్‌బీఐ కొత్త షాక్‌!

డిపాజిట్ నిబంధనల్లో మార్పులు

విధాత‌: బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలి ఉన్న డిపాజిట్లకు వర్తించే వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలను సవరించింది. డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని బ్యాంకులకు ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం టర్మ్‌ డిపాజిట్లను కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్‌ వెనక్కి తీసుకోకపోతే.. ఆ తర్వాత నుంచి ఆ మొత్తంపై సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటు అమలవుతోంది. ఇక మీదట అలా కాదు. ‘‘టర్మ్‌ డిపాజిట్‌ గడువు తీరినా, క్లెయిమ్‌ చేసుకోకుండా బ్యాంకు వద్దే ఉండిపోతే ఆ మొత్తంపై సేవింగ్స్‌ ఖాతా రేటు లేదా టర్మ్‌ డిపాజిట్‌ ఒప్పంద రేటు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది అమలవుతుంది’’ అంటూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, కోఆపరేటివ్‌ బ్యాంకులకు నూతన ఆదేశాలు వర్తిస్తాయి.

Exit mobile version