Site icon vidhaatha

కేటీఆర్‌లాంటి నేతలు ఉంటే నాలాంటి వాళ్ల అవసరం ఉండదు

విధాత‌: కేటీఆర్‌లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండని ప్రముఖ సినీ నటుడు సోనుసూద్‌ అన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీలో కొవిడ్‌-19 వారియర్స్‌ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్‌ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారన్నారు. వాళ్లకు సహాయ పడడమే ఇక తన ముందున్న సవాల్‌ అన్నారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసినా.. ఒక్క తెలంగాణ నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందని.. అది కేటీఆర్‌ కార్యాలయం అని సోనుసూద్‌ కొనియాడారు.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-08-at-15.39.33.mp4
Exit mobile version