Site icon vidhaatha

తిరుమ‌ల‌లో ప్ర‌యోగ‌త్మ‌కంగా సాంప్ర‌దాయ భోజ‌నం ప్రారంభం

విధాత‌: తిరుమ‌లలో శ్రీ‌వారి భ‌క్తుల కొర‌కు సాంప్ర‌దాయ భోజ‌నం ప్ర‌యోగ‌ త్మ‌కంగా అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురు వారం ఉద‌యం ప్రారంభించారు. టీటీడీ ఇప్పటికే గోవింద‌దునికి గో ఆధారిత నై వేద్యం అందించడంలో భాగంగా దేశీయ గోవుల ఉత్పత్తులతో చేసిన వ్య‌వ‌సా యం ద్వారా పండించిన బియ్యం, ప‌ ప్పు దినుసులు, బెల్లం, నెయ్యితో శ్రీవా రికి అన్న ప్రసాదాల నైవేద్యం అందిస్తు న్న విష‌యం తెలిసిందే. అదేవిధంగా దే శీయ వ్య‌వ‌సాయంతో పండించిన బి య్యం, ప‌ప్పు దినుసుల‌తో త‌యారు చే సిన అల్ఫాహ‌రం, భోజ‌నం ఎలాంటి ఆ దాయం లేకుండా కాస్టు టు కాస్టుతో టి టిడి భ‌క్తుల‌కు అందించాల‌ని సంక‌ల్పిం చింది. సాంప్ర‌దాయ భోజ‌నంపై భ‌క్తుల అభిప్రాయాలు, సూచ‌న‌లు తీసుకుని సెప్టెంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు టిటిడి ప్ర‌యో గ‌త్మ‌కంగా నిర్వ‌హించ‌నుంది. ఈ సంద‌ ర్భంగా దేశీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌కు లు విజ‌య‌రామ్ మాట్లాడుతూ మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన గో ఆ ధారిత వ్య‌వ‌సాయంతో పండించిన దే శీయ బియ్యం, ప‌ప్పుదినుసులు, కూర‌ గాయ‌లను టిటిడి కోనుగోలు చేయ‌డం అభినంద‌నీయమ‌న్నారు. దీని ద్వారా దే శీయ విత్త‌నాలు, దేశీయ గో జాతులను గ్రామ‌ల్లోకి పునః ప్ర‌వేశ‌పెట్టవ‌చ్చ‌న్నారు. అనంత‌రం చిరుధాన్యాల ఆహ‌ర నిపు ణులు రాంబాబు మాట్లాడుతూ దేశీయ ఆవునెయ్యి, బెల్లం త‌యారు చేసి అందించిన‌ట్లు తెలిపారు. ఇందులో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన సూక్ష్మ పోష‌కాలు, అనేక వ్యాధుల‌ను ఎదుర్కొ నే వ్యాధి నిరోద‌క శ‌క్తి ఉంటుంద‌న్నారు.
మ‌ధ్యాహ్నం కొబ్బ‌రి అన్నం, పులిహోర‌, పూర్ణ‌లు, వ‌ర్ష రుతువులో తీసుకోవ‌సిన అహారమైన ప‌చ్చి పులుసు, దోశ‌కాయ ప‌ప్పు త‌దిత‌ర 14 ర‌కాల వంట‌కాలు చెఫ్ గోపి వండి భ‌క్తుల‌కు అందించిన‌ట్లు వివ‌రించారు. భ‌విష్య‌త్తులో ఆరోగ్య‌క‌ర‌ మైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల‌న మ‌న ఆరోగ్యంతో పాటు రైతు సంక్షేమం, గో సంక్షేమం,దేశం కూడా ఆర్థికాభివృద్ధి చెందుతుంద‌న్నారు.

Exit mobile version