విధాత,ఢిల్లీ:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ముప్పరవపు వెంకయ్యనాయుడు అతని సతీమణి ఉషమ్మతో కలిసి సోమవారం ఉపరాష్ట్రపతి నివాసంలో యోగా సాధన చేశారు.
ఈ ఏడాది ‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలని జరుపుకొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలని ఆయన కోరారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.