Bhu Bharathi । భూ యజమానికి భరోసా కంప్యూటరా? కాగితమా? నిపుణులేమంటున్నారు?

కాగితాలపైన వివరాలుంటే ట్యాంపరింగ్‌కు అవకాశం ఉంటుందని, లంచగొండితనం పెరుగుతుందని, అందుకే మాన్యువల్ రికార్డులు కాకుండా కంప్యూటర్ రికార్డులే మేలనేవారూ ఉన్నారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా భూమి రికార్డుల కంప్యూటరీకరణ జరిగింది. అయితే మాన్యువల్ రికార్డులు కూడా నిర్వహిస్తున్నారు. రైతుల భూమి వివరాలు కంప్యూటర్‌లో ఉన్నా పట్టాదార్ పాస్ పుస్తకం ఇస్తేనే తన వద్ద భూమి భద్రంగా ఉందని రైతు భరోసాతో ఉంటాడని ప్రముఖ న్యాయవాది, భూమి చట్టాల నిపుణుడు భూమి సునీల్ చెప్పారు.