ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అసిడిటీ సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. టీలో ఉండే కెఫీన్, టానిన్ వంటి పదార్థాలు కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల గుండెల్లో మంట, గ్యాస్, అజీర్ణం తలెత్తుతాయి.
ఉదయాన్నే పరగడుపున టీ తాగితే మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే టీలో ఉండే చక్కెర దంతాల ఆరోగ్యం పాడు చేస్తుంది. పంటిపై ఉండే ఎనామిల్ పొర బలహీనపడటంతో పళ్ళు త్వరగా దెబ్బతింటాయి.
గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటే టీలో అల్లం, యాలకులు వేసుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో దొరికే వస్తువులతో అసిడిటీ నుండి బయటపడవచ్చు. సోంపు గింజలు నమలడం లేదా జీలకర్ర నీరు తాగడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది.