కాల్షియం పుష్కలంగా లభించడం వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయి. ముఖ్యంగా ఈ మఖానా సాగు ఎక్కువగా బిహార్లో ఉంటుంది. ఇది అక్కడి వారి ప్రధాన జీవనాధార పంటల్లో ఒకటి. దీని వినియోగం వల్ల రైతులకు జీవనాధారంగా మారుతోంది.
రాగి, జొన్న, సజ్జ వంటి ధాన్యాలు వేల సంవత్సరాలుగా మన దేశంలో పుష్కలంగా పండుతున్నాయి. శ్రీ అన్న అనే పిలవబడే మిల్లెట్లు పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉంటాయి. తక్కువ నీటితో పండే గుణం కలిగి ఉంటాయి.
బ్లాక్ రైస్ - బ్లాక్ రైస్పై కూడా ప్రధాని మోదీ పలుమార్లు ప్రశంసలు కురిపించారు. మణిపూర్, ఒడిశాలో పండే ఈ బియ్యం జీర్ణక్రియకు ఎంతో సహాయకపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ఇది ఉపయుక్తంగా పని చేస్తుంది