ఒకప్పుడు రాజులు, రాణులు మాత్రమే ధరించగలిగే అరుదైన వజ్రాలు ఇప్పుడు కొందరు భారతీయ ప్రముఖుల వద్ద కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త మెగా కృష్ణారెడ్డి భార్య సుధా రెడ్డి ధరించిన ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
దీని ప్రధాన ఆకర్షణగా టాంజానియాలోని మెరెలాని కొండల నుంచి వచ్చిన 550 క్యారెట్ల అరుదైన టాంజనైట్ రత్నాన్ని అమర్చారు. ఊదా-నీలం రంగులో మెరిసే ఈ రత్నం నెక్లెస్కు ప్రత్యేకమైన లుక్ ఇచ్చింది. దీనికి జతగా రాజస్థాన్కు చెందిన పోల్కీ డైమండ్ రింగ్ను కూడా ధరించి ఆమె మరింత అందంగా కనిపించారు.
ఈ లుక్ స్పెషల్గా ఉండటానికి ప్రముఖ డిజైనర్ Manish Malhotra రూపొందించిన రాయల్ బ్లూ గౌన్ను సుధా రెడ్డి ధరించారు. జర్దోజీ వర్క్, మెటాలిక్ డిజైన్స్తో కూడిన ఈ గౌన్ ఆమెకు మరింత రాజసం ఉట్టిపడేలా చేసింది. పొడవైన ట్రెయిల్తో కూడిన ఈ డ్రెస్సు మెట్ గాలా థీమ్కు సరిపోయేలా డిజైన్ చేశారు.