Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఐదు సీట్లిస్తే.. వెయ్యి కోట్లిస్తా... బీజేపీకి ఓ మాజీ మంత్రి బంపర్ ఆఫర్!

ఇది బహుశా పొలిటికల్‌ ఆఫర్లలోనే గ్రేటెస్ట్‌ ఆఫర్‌ అవ్వడం ఖాయం. ఢిల్లీలోని రాజకీయవర్గాల్లో, పాత్రికేయుల్లో జరుగుతున్న చర్చలు, వినిపిస్తున్న వాదనల ప్రకారం.. తెలంగాణకు చెందిన ఓ మాజీ మంత్రి బీజేపీలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తున్నది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. తమ కుటుంబానికి ఐదు సీట్లు ఇస్తే.. ప్రతిఫలంగా పార్టీ ఫండ్‌ కింద వెయ్యి కోట్లు ఇస్తానని ఆఫర్‌ చేశారట!

political buzz in delhi circles about 1000 crore offer from a ex minister - image generated with AI help

ముక్కణపు వన్డే సిరీస్..టీమిండియా- ఏ జట్టులోకి వైభవ్ ఎంట్రీ !

శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా-ఏ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా, తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

మోదీ హామీ వట్టి మాటే.. మెట్రో విస్తరణకు ఇవ్వని గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్ మెట్రో విస్తరణకు అవసరమైన అన్ని షరతులు పూర్తి చేసినప్పటికీ కేంద్ర కేబినెట్ మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో తెలంగాణలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కోవిడ్‌ వల్ల 2.20 కోట్ల మంది మృతి: డబ్ల్యుహెచ్ వో కీలక ప్రకటన

కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.20 కోట్ల మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. మహమ్మారి ఆరోగ్య వ్యవస్థల బలహీనతలను బయటపెట్టిందని నివేదిక పేర్కొంది.

భారత్ నౌకపై దాడి.. ఖండించిన కేంద్రం

ఒమన్‌ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై తాజాగా క్షిపణి దాడి కలకలం రేపింది. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ తరహా దాడి ఆమోదయోగ్యం కాదని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఆ నౌకలోని భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారనివి దేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు.

శ్రీ అమ్మ భగవాన్ బోధనల నేపథ్యంలో "ఏదైనా సాధ్యమే" మూవీ

శ్రీ అమ్మ భగవాన్ బోధనల ఆధారంగా రూపొందుతున్న “ఏదైనా సాధ్యమే” మూవీ టైటిల్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఆధ్యాత్మికత, మానవ సంబంధాల నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.