కర్నూల్ : నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ టీఎస్ 08 జీఈ 1680.