Gold Rates | మగువలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా పతనమైన బంగారం.. నేటి ధరలివే..!

  • Publish Date - March 19, 2024 / 01:51 AM IST

Gold Rates | మగువలకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా పెరిగిన ధరలు వరుసగా దిగివస్తున్నాయి. మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులం రూ.60,370కి చేరింది. 24 క్యారెట్ల పసిడి తులం రూ.65,860కి దిగివచ్చింది. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.60,890 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,430కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.60,370 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.65,860కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.60,520 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,110కి చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.60,370 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.65,860 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం స్వల్పంగా పతనమైంది. రూ.100 తగ్గి కిలో బంగారం ధర రూ.76,900కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.79,900కు తగ్గింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Latest News