Gold Rates | పైపైకి బంగారం ధరలు..! మళ్లీ ఎంత పెరిగిందంటే..?

  • Publish Date - February 22, 2024 / 04:22 AM IST

Gold Rates | బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బులిమార్కెట్‌లో స్వల్పంగా ధర పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.10 పెరిగి తులానికి రూ.57,610కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి తులానికి రూ.62,750కి ఎగిసింది. వెండి కిలోకు రూ.100 వరకు పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,110 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,390కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,610 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,750కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,760 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,900కి ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,610 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,750 పలుకుతున్నది.

ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.100 వరకు పెరిగింది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.77,300 వద్ద ట్రేడవుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Latest News