Site icon vidhaatha

Breaking: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. 30% బోనస్‌

విధాత: సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరా లోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్‌కు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా, అర్హులైన కార్మికులకు రూ.368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనున్నది.

Exit mobile version