ఇప్పుడు మెగా ఇంట పెళ్లి సందడి నెలకొన్న విషయం తెలిసిందే. నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీ వేదికగా పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు త్రిపాఠి ఫ్యామిలీ ఇటలీ చేరుకుంది. అయితే ఒకవైపు వరుణ్ పెళ్లి హంగామా నడుస్తున్న సమయంలో సీతారామం హీరోయిన్ మెగా హీరోతో పెళ్లి పీటలు ఎక్కనుంది అని కొందరు జోస్యం చెప్పుకొస్తున్నారు. అంతేకాదు అందుకు కారణం కూడా చెబుతున్నారు. మేటర్లోకి వెళితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ.. నీకు హైదరాబాద్ కుర్రాడితోనే పెళ్లిజరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వు అని ఆశీర్వదించారు.
అల్లు అరవింద్ ఆశీర్వదించినట్టుగానే ఆమె వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకోబోతుంది. అరవింద్ హైదరాబాద్ అబ్బాయిని చేసుకోమంటే, లావణ్య త్రిపాఠి ఏకంగా వారి ఫ్యామిలీ అబ్బాయితోనే పెళ్లి పీటలు ఎక్కుతుంది. ఇక రీసెంట్గా సైమా అవార్డ్స్ వేడుకలో అల్లు అరవింద్.. మృణాల్ ఠాకూర్ కి ఆశీర్వాదం అందించాడు. మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ హీరోయిన్ గా బెస్ట్ యాక్టర్ గా అవార్డును సొంతం చేసుకోగా, ఈ అవార్డును ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా అందుకుంది. ఆ సమయంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘మృణాల్ ఠాకూర్ కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలి. హైదరాబాద్ కుర్రాడితోనే ఆమె మ్యారేజ్ జరగాలంటూ ఆశీర్వాదాలు అందించాడు. అంతేకాదు తాను హైదరాబాద్లో సెటిల్ కావాలని కోరుకుంటున్నట్టు సైమా వేదికపై వ్యాఖ్యానించారు.
అయితే లావణ్య త్రిపాఠికి ఆశీర్వాదం అందిస్తే ఆమె వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుంటుంది. ఇక ఇప్పుడు మృణాల్ ఠాకూర్కి ఆశీర్వాదం ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఏ మెగా హీరోని చేసుకుంటుందా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలానే నాని సరసన కూడా నటిస్తుంది