Site icon vidhaatha

Special Trains | హోలీకి మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | హోలీ పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌-దానాపూర్‌, దానాపూర్‌ – హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-సంత్రగాచి, సంత్రగాచి-సికింద్రాబాద్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌-దానాపూర్‌ (07647) రైలు ఈ నెల శనివారం(23న) రాత్రి 8.20 గంటలకు బయలుదేరి రెండురోజుల తర్వాత అంటే సోమవారం ఉదయం 5.50 గంటలకు గంటలకు దానాపూర్‌ చేరుకుటుంది. దానాపూర్‌ – సికింద్రాబాద్‌ (07648) రైలు 26న సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరుతుంది. హైదరాబాద్‌-దానాపూర్‌-హైదరాబాద్‌ రైలు ఇరుమార్గాల్లో సికింద్రాబాద్‌, జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండుం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్షా, నాగ్‌పూర్‌, ఇటార్సీ, పిపారియా, జబల్‌పూర్‌, కట్ని, సాత్న, మణిక్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, పండిత్‌ ధీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్టేషన్లలో ఆగుతుంది.

23న (శనివారం) సికింద్రాబాద్‌-సంత్రగాచి (07645) రైలు రాత్రి 9.05 గంటలకు బయలుదేరి.. రైలు సోమవారం వేకువ జామున 12.15 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. సంత్రగాచి-సికింద్రాబాద్‌ రైలు (07646) రైలు 25న సోమవారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళంరోడ్‌, బర్హంపూర్‌, కుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, జాజ్పూర్ కియోంఝర్ రోడ్, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Exit mobile version