Site icon vidhaatha

Gold Rates | పసిడి కొనాలనుకుంటున్నారా..? ఆలస్యం చేయకుండా కొనేయండి..! నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరిగిన ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం సైతం బులియన్‌ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.66,950 వద్ద నిలకడగా ఉన్నది. 24 క్యారెట్ల స్వర్ణం తులానికి రూ.73,040 వద్ద ట్రేడవుతున్నది. అయితే, వెండి ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.66,950 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.73,040 వద్ద ట్రేడవుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.67,110 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,190 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.66,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,040 వద్ద కొనసాగుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,040 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో కిలోకు రూ.87,900 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలోకు రూ.92,900కి తగ్గింది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version