Gold Rates | పసిడి కొనుగోలుదారులకు గుడ్న్యూస్. ఇటీవల వరుసగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. బులియన్ మార్కెట్లో నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర మంగళవారం దిగివచ్చింది. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.200 తగ్గి తులానికి రూ.63,200కి పతనమైంది. 24 క్యారెట్ల బంగారం రూ.210 తగ్గి తులానికి రూ.68,950కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. వివిధ నగరాల్లో బంగారం స్వల్పంగా పెరగ్గా.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.63,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.69,650కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.63,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,100కి పతనమైంది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.63,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.68,950కి చేరింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.63,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.68,950కి దిగివచ్చింది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కిలోకు రూ.500 పతనమైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.84,500 పలుకుతున్నది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.89వేలకు చేరింది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.