Site icon vidhaatha

SSMB29 | వామ్మో… వెయ్యి కోట్లా..? రాజమౌళి ఈసారి ఏం సృష్టించబోతున్నాడు?

ఎస్​ఎస్​ఎంబీ29(SSMB29).. ఈ తాత్కాలిక టైటిల్​ ఇప్పటికే బాగా ఫేమస్​ అయింది. అసలు పేరు గరుడ()గా గుసగుసలు వినిపిస్తున్నాయి. జనవరిలో షూటింగ్​ మొదలు కానుంది. దర్శక బృందం ప్రస్తుతం కెన్యాలో ఉంది. అమెజాన్​ అడవుల్లో పర్యటన ఇంకా బాకీ ఉంది. మరో టీమ్​ కథ, స్క్రీన్​ప్లే మీద పనిచేస్తుంటే, మరో టీమ్​ నటీనటుల లుక్స్​ మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉన్నారు. తెలుసు కదా.. ఇదంతా మహేశ్​–రాజమౌళిల సినిమా చరిత్రే.

ఇండియానా జోన్స్(Indiana Jones)​ కాదు.. ఇండియన్​ జోన్స్(Indian Jones)​ను సృష్టించబోతున్నాడు ఎస్​ఎస్​ఆర్​ఎం. మహేశ్​బాబు హీరోగా, అటవీసాహసయాత్ర(Forest Adventure) కథతో రాజమౌళి తీయబోతున్న చిత్రం రెండు భాగాలు(Two Parts)గా, సుమారు వెయ్యి కోట్ల(1000 Crores) బడ్జెట్​తో రూపొందబోతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు భారత్​లో అత్యధిక వ్యయంతో తయారైన సినిమా రోబో 2.0. దీనికి 570 కోట్లు ఖర్చు చేసారు. రెండోస్థానంలో ఆర్​ఆర్​ఆర్​ ఉంది. ఇది 550 కోట్లతో తయారైంది. ఇప్పుడు #SSMB29 వెయ్యి కోట్ల బడ్జెట్​తో ఇండియాలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకోబోతున్న చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇక ఈ చిత్ర విశేషాలు అన్నీఇన్నీ కావు. భారత్​లోనే మొట్టమొదటిసారిగా ఏఐ సాంకేతికత(AI technology)ను పూర్తిస్థాయిలో వినియోగించుకోబోతున్న చిత్రం. కొన్ని పాత్రలు, జంతువులు కృత్రిమ మేధ ఆధారంగా తయారుకాబోతున్నాయట. ఏఐని సమర్థవంతంగా ఉపయోగించడం కోసం ఏకంగా రాజమౌళే శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. విఎఫ్​ఎక్స్​ను సుందరంగా తీర్చిదిద్దడంలో రాజమౌళిని మించినవారెవరూ ఉండరు. ఈ సినిమాలోని గ్రాఫిక్స్​ ‘అవతార్’(Avatar)​ను మించి ఉంటాయని చెపుతున్నారు.

ఆర్​ఆర్​ఆర్​తో ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాను ఇండియన్​ గ్లోబల్​ సినిమాగా పరిచయం చేయబోతున్నారు. ఇందుకోసం హాలీవుడ్​లోని ప్రముఖ స్టుడియోలు(Hollywood Studios), విఎఫ్​ఎక్స్​ కంపెనీలు, దర్శకులను సంప్రదించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా మహేశ్​బాబును కూడా గ్లోబల్​ హీరోగా మార్చబోతోందన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అందుకు సూపర్​స్టార్​ కూడా బాగానే కష్టపడుతున్నాడు. లుక్​ కూడా పూర్తిగా మార్చేసాడు. పొడుగాటి జుట్టు, గుబురు గడ్డంతో ఇండియన్ కీనూ రీవ్స్​(Keanu Reeves)లా తయారవుతున్నాడు. నిపుణులైన ఫిట్​నెస్​ ట్రైనర్స్​ సహాయంతో కసరత్తులు కూడా బాగా చేస్తున్నట్లు ఫోటోల ద్వారా తెలుస్తోంది. ​ దుర్గా ఆర్ట్స్​ పతాకంపై కెఎల్​ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్​ కీరవాణి సంగీతం అందిస్తారు.

Exit mobile version