Prabhas | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అదే సమయంలో కొత్తగా కథలను సైతం వింటున్నాడు. పలువురు డైరెక్టర్లు కథలు చెప్పేందుకు రెడీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఓ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ కాకుండా అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఆ మూవీ మంచు విష్ణు హీరోగా తెరకెక్కతున్న ‘కన్నప్ప’ చిత్రం. ఈ మూవీని విష్ణు తన సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఈ మూవీలో ప్రభాస్ కీలకపాత్ర పోషించబోతున్నాడు. అయితే, ఈ మూవీలో ఏ పాత్రపోషిస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో తనకు నచ్చిన క్యారెక్టర్లోనే ప్రభాస్ నటిస్తున్నాడని విష్ణు సైతం ప్రకటించాడు ఇదిలా ఉండగా ఈ మూవీ కోసం ప్రభాస్ తీసుకున్న పారితోషకం ఎంత అనేది చర్చనీయాంశమైంది. యంగ్ రెబల్ స్టార్ ఇమేజ్కి తగినట్లుగానే అని, ఇన్ని కోట్లు తీసుకొని ఉంటాడనే ఊహాగానాలున్నాయి. అయితే, ఈ మూవీకి ప్రభాస్ అసలు పారితోషకమే తీసుకోవడం తెలుదని తెలుస్తున్నది. కేవలం మోహన్బాబు ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన అతిథి పాత్ర చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.
ప్రభాస్ ఏ క్యారెక్టర్లో చేసిన అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందనడంలో సందేహం లేదు. ఇక ప్రభాస్ చివరిసారిగా గతేడాది సలార్-1లో తెరపై కనిపించాడు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో కల్కీ 2898 ఏడీ సినిమాలో భైరవ పాత్ర పోషిస్తున్నాడు. పాన్ హాలీవుడ్ స్థాయిలో ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశా పటానీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అశ్వత్థామ పాత్ర పోషిస్తుండగా.. విశ్వనటుడు కమల్ హసన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వీటితో పాటు సలార్-2 శౌర్యంగపర్వం, రాజాసాబ్లో నటిస్తున్నాడు.