Dhanush-Aishwarya |ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య‌ల‌ది ఫేక్ లైఫ్.. నిజ‌జీవితంలోను న‌టించే జంట అన్న నిర్మాత‌

Dhanush-Aishwarya | ఈ మ‌ధ్య కాలంలో డివోర్స్ తీసుకొని వార్త‌ల‌లోకి ఎక్కిన జంట‌ల‌లో ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య జంట ఒక‌టి. వీరిద్ద‌రు 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు 18 ఏళ్ల పాటు సంతోషంగానే ఉన్నారు. వీరి వైవాహిక జీవితంలో లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఎంతో సంతోషంగా వీరి జీవితం సాగుతున్న నేప‌థ్యంలో ఒక్క‌సారిగా విభేదాలు రావ‌డంతో తాము 2022లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్ర‌క‌టించి పెద్ద షాక్ ఇ

  • Publish Date - April 25, 2024 / 07:42 AM IST

Dhanush-Aishwarya | ఈ మ‌ధ్య కాలంలో డివోర్స్ తీసుకొని వార్త‌ల‌లోకి ఎక్కిన జంట‌ల‌లో ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య జంట ఒక‌టి. వీరిద్ద‌రు 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు 18 ఏళ్ల పాటు సంతోషంగానే ఉన్నారు. వీరి వైవాహిక జీవితంలో లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఎంతో సంతోషంగా వీరి జీవితం సాగుతున్న నేప‌థ్యంలో ఒక్క‌సారిగా విభేదాలు రావ‌డంతో తాము 2022లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్ర‌క‌టించి పెద్ద షాక్ ఇచ్చారు. ఇక పిల్ల‌ల బాధ్య‌త‌ని ఐశ్వ‌ర్య తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవలే వీరు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టు కు దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్‌ 13బీ కింద సరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేయ‌గా, దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్టోబర్‌ 7న ధనుష్‌ – ఐశ్వర్య ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

అయితే ధ‌నుష్- ఐశ్వ‌ర్య‌ల విడాకుల త‌ర్వాత వారిద్ద‌రికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట వైర‌ల్ అవుతూనే ఉంటుంది. వారి బంధం గురించి ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక కామెంట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత కె.రాజన్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. వీరిది ఫేక్ లైఫ్ అని కామెంట్ చేశారు. ధనుష్, ఐశ్వర్యలు సినిమాలతో పాటు నిజజీవితంలో కూడా నటించే జంట అంటూ బ‌హిరంగంగానే కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్య‌లు త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాశంగా మారాయి.ధనుష్ – ఐశ్వర్య విడిపోయే ముందుకు ఒక్క‌సారి ఆలోచించి ఉంటే బాగుండేది. ఇదేమి బొమ్మలాట కాదు.. 18 ఏళ్లు కలిసి కాపురం చేసిన వారు ఇద్ద‌రి కొడుకుల కోసం అయిన‌.. తప్పు ఒప్పులను సరిదిద్దుకుంటూ వెళితే బాగుండేది అని అన్నాడు

ధ‌నుష్ ఎఫైర్స్ వ‌ల‌న ఈ విడాకులు ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇది నిజమైతే.. ధనుష్ కూడా మారాల్సి ఉంటుంది అనే విధంగా రాజ‌న్ మాట్లాడారు. తమిళ సంసృతిని కాపాడాలి అని మీకు అనిపిస్తే.. దయచేసి కలిసిపోండి విడాకులు తీసుకోకండి అంటూ రాజన్ వేడుకున్నారు. సూటిగా మాట్లాడ‌కూడ‌దు అని నాకు అనిపించింది కాని మ‌న‌స్సు ఏ మాత్రం ఒప్పుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రాజ‌న్. ఇక ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య విడాకుల‌కి సంబంధించి కోర్టులో ప్రోసీజర్ నడుస్తోంది. త్వ‌ర‌లో వారిద్ద‌రు కూడా చ‌ట్ట‌ప‌రంగా విడిపోబోతున్నారు

Latest News