డ్రగ్స్‌ కేసులో రవితేజ.. నేడు ఈడీ విచారణ

విధాత:టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రవితేజ,అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ)విచారణను ఎదుర్కోనున్నారు. PMLA కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) రవితేజ, అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈడీ ఎదుట హాజరు కానున్నారు.గతంలోనూ వీరు ఎక్సైజ్ విచారణను ఎదుర్కొరన్న విషయం తెలిసిందే. మనీలాండరింగ్‌,ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వీళ్లిద్దరిని విచారించనున్నారు.ఇప్పటికే ఈ కేసులో పూరి జగన్నాథ్‌, చార్మీ,రకుల్‌,నందు,రానాలను ఈడీ అధికారులు విచారించిన […]

  • Publish Date - September 9, 2021 / 04:32 AM IST

విధాత:టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రవితేజ,అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ)విచారణను ఎదుర్కోనున్నారు. PMLA కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) రవితేజ, అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈడీ ఎదుట హాజరు కానున్నారు.గతంలోనూ వీరు ఎక్సైజ్ విచారణను ఎదుర్కొరన్న విషయం తెలిసిందే.

మనీలాండరింగ్‌,ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వీళ్లిద్దరిని విచారించనున్నారు.ఇప్పటికే ఈ కేసులో పూరి జగన్నాథ్‌, చార్మీ,రకుల్‌,నందు,రానాలను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.అయితే నందు,రానాలను డ్రగ్‌ అప్రూవర్‌ కెల్విన్‌ సమక్షంలో ఈడీ విచారించింది.దీంతో నేడు మరోసారి కెల్విన్‌ హాజరు అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Latest News