Biparjoy Cyclone
విధాత: బిపర్ జాయ్ తుఫాన్ (Biparjoy Cyclone) దేశంలో బీభత్సం సృష్టిస్తున్నది. ఈ తుఫాన్ కారణంగా సముద్రపు అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పశ్చిమ ముంబై శివారులోని జుహు కోలివాడ బీచ్లో సముద్ర అలల కారణంగా ఇద్దరు బాలలు మరణించారు.
మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. మరోవైపు తుఫాన్ పరిణామాలపై ప్రధాని మోదీ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుజరాత్, ముంబై తీర ప్రాంతాల్లో అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.