BRS కార్పొరేటర్ అరెస్ట్.. గ్రేటర్ వరంగల్‌లో కలకలం

ఖమ్మం జైలుకు వేముల శ్రీనివాస్ నిందితుడు చీఫ్ విప్ దాస్యంకు అంత్యంత సన్నిహితుడు మరో సంఘటనలో ఐదుగురు అరెస్ట్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ల్యాండ్ కబ్జా ఆరోపణల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గ్రేటర్ వరంగల్ లో అధికార పార్టీని భారీ కుదుపు కుదిపేస్తున్నది. భూ కబ్జాల నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు నాన్​బెయిలబుల్​ కేసులు నమోదు చేసిన పోలీసులు […]

  • Publish Date - January 21, 2023 / 02:10 PM IST
  • ఖమ్మం జైలుకు వేముల శ్రీనివాస్
  • నిందితుడు చీఫ్ విప్ దాస్యంకు అంత్యంత సన్నిహితుడు
  • మరో సంఘటనలో ఐదుగురు అరెస్ట్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ల్యాండ్ కబ్జా ఆరోపణల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గ్రేటర్ వరంగల్ లో అధికార పార్టీని భారీ కుదుపు కుదిపేస్తున్నది.

భూ కబ్జాల నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు నాన్​బెయిలబుల్​ కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం సెకండ్ అడిషనల్ ​జ్యుడిషియల్ ఫస్ట్​ క్లాస్​ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..

హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్​ డెవలప్​మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్​ ఓనర్​ సునీత దంపతులను హెచ్చరించాడు.

వాళ్లు కాద‌ని చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్​మీదికి వెళ్లి కాంపౌండ్​వాల్​ను కూల్చేశాడు. తమను బెదిరించడంతోపాటు ఆస్తి ధ్వంసం చేయడంతో బాధితులు నాలుగు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రాథమిక విచారణ అనంతరం సీపీ ఏవీ రంగనాథ్​ఆదేశాలతో కార్పొరేటర్​ వేముల శ్రీనివాస్​తో పాటు అతడి డ్రైవర్ ​పడాల కుమారస్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం నిందితులకు వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్​ జేఎఫ్​సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్​ ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించారు. అయితే నిందితుడు ఛీప్ విప్ దాస్యం శ్రీ‌నివాస్‌కు అత్యంత స‌న్నిహితుడని స‌మాచారం.

మరో సంఘటనలో ఐదుగురు అరెస్ట్

మరో ఘటనలో దేశాయిపేటలోని సర్వేనంబర్ 90/బిలో భూమిని ఆక్రమణ చేసేందుకు యత్నించిన వరంగల్ నగరానికి చెందిన పొక్కులు చిరంజీవిరావు, గొడాసి అశ్విన్ కుమార్, సురోజు రమేష్ లను ఇంతేజార్గంబీ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరులు బొమ్మకంటి శ్రీనివాస్, మునుగంటి రమేష్ ప్రస్తుతం పరారీలో వున్నారు.

ఈ సంఘటనలో నిందితులు తప్పుడు పత్రాలను సృష్టించడంతో పాటు ప్రభుత్వం సూచించిన ధరల పట్టిక కన్న అతి తక్కువ ధరకు భూమిని ఎలాంటి లావాదేవీలు జరగకున్న క్రయ విక్రయాలు జరిగినట్లుగా లేని భూమికి సంబంధించిన‌ ప్రతాలను సృష్టించారు ఈ నిందితులు.

అలాగే దేశాయిపేటలోని సర్వే నంబర్ 90/బి భూమి తాము కొనుగోలు చేసినట్లుగా నిందితులు అసలు భూ యజమానులను బెదిరించి భూమిని ఆక్రమించడంతో బాధితులు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసిన ఇంతేజార్ గంజ్ పోలీసులు ప్రాథ‌మిక విచారణలో భాగంగా క్షేత్ర స్థాయిలో భూమికి సంబంధించి పత్రాలను పోలీసులు పరిశీలించారు. దీంతో నిందితులు భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా ప్రాథ‌మిక నిర్ధారణ రావడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

.