- తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొట్టి.. దేశంలో అమలు చేస్తున్నారు
- మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో నేడు దేశానికి ఆదర్శంగా తెలంగాణ
- మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ యువకులు
విధాత: సిద్ధిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల, పట్టణంలోని 37వ వార్డు నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఇతర నియోజకవర్గాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని, అభివృద్ధితో పాటు సేవలో ఆదర్శంగా నిలిచిందని, ఇది ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు.
2001 నుంచి 2014 వరకూ ఉద్యమంలో సిద్ధిపేట ఆదర్శంగా ఉన్నదని నాటి ఉద్యమం, నేటి అభివృద్ధి అన్నింటి లో ఆదర్శంగా నిలుస్తుమన్నారు. సిద్ధిపేట అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారని ప్రతిపక్షాల తీరుపై మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు.
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధాన మంత్రులు మారినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారని, తాగునీరు ఇవ్వలేకపోయారని కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
కానీ తెముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మూడున్నరేళ్లలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీరు అందించామని దాన్నే కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ కో జల్” పేరిట కాపీ కొట్టిందన్నారు. మిషన్ కాకతీయతో నాటి కాకతీయుల కాలం నాటి చెరువులను వారసత్వ సంపదకు పూర్వ వైభవంగా 40వేల చెరువులను బాగు చేసుకున్నామన్నారు. దాన్నే “అమృత్ సరోవర్” పేరిట కేంద్రం కాపీ కొట్టిందని విమర్శించారు.
70 ఏళ్లలో జరగని గ్రామాల అభివృద్ధికి స్వరూపం నేడు పల్లెల్లో అభివృద్ధి వెల్లువిరుస్తుందన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్క యువకుడు అలోచించి ప్రజల్లో నిజాన్ని తెలియజెప్పాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారిని గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.